Wednesday, August 23, 2023

శ్రీశ్రీశ్రీ మల్లెంకొండ గుర్రప్ప స్వామి చరిత్ర

instagram link; @MADHU.GURUJI.5 https://instagram.com/madhu.guruji.5?igshid=ZDc4ODBmNjlmNQ==

శ్రీశ్రీశ్రీ మైలవరం గుర్రప్ప స్వామి చరిత్ర
video link:
https://youtu.be/kL-bwyDP8wc

శ్రీశ్రీశ్రీ మద్దిమాను గుర్రప్ప స్వామి చరిత్ర
video link;
https://youtu.be/SYhbsU6cKbU

మల్లెం కొండయ్య గుర్రప్ప స్వామి కథ చదవండి:
సోమశిల నుండి మాల ఆకారంలో గోపవరం చుట్టుకుని చిన్నారి పల్లె దగ్గర ముగుస్తుంది ఈ మల్లెం కొండ ప్రాంతం.         ప్రధాన దేవుడు మల్లెం కొండేశ్వర స్వామి మాల ఆకారంలో ఉంది కాబట్టి మాల్యాద్రి పర్వతం అంటారు సీతాదేవిని వెతుకుతున్నప్పుడు కార్తీక మాసం కావడంతో రాముడు ఈ ప్రదేశంలో ఉండటం వల్ల పూజ కోసం శివలింగాన్ని ఏర్పాటు చేశారని కొందరు చెబుతారు ఇక్కడ ప్రధాన దేవతలు శివుడు గుర్రప్ప స్వామి మరియు అంకమ్మ తల్లి ఈ ప్రాంతంలో మనం కప్పులేని మొండి గోడలతో ఉన్న దేవాలయాన్ని చూస్తాం ఎన్నిసార్లు ఇక్కడ గోపురం కట్టాలనుకున్న అది నిలవలేదు అది స్వామి మహత్యం గా చెప్పుకుంటారు కడప జిల్లాలోని బద్వేలు తాలూకా గోపవరం మండలం మల్లెం కొండలో మల్లం కొండేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు కొండల్లో కాలినడకన ట్రెక్కింగ్ చేయాలి.                          ఇక చరిత్ర విషయానికి వస్తే అంకమ్మ అనే శివ భక్తురాలు ఈవిడ రాజవంశానికి చెందిన వ్యక్తి అయితే ఆమె కాశీయాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో మల్లంకొండ శివాలయం ఉందని తెలుసుకొని తన అనుచరులతో పాటు అక్కడికి చేరుకొని రాత్రిపూట శివుని పూజించింది ఉదయాన్నే జలపాతం లో స్నానం చేసి శివున్ని పూజిస్తుండగా ఆ ప్రాంతానికి రాక్షస జాతికి చెందిన మనుషులు దుర్మార్గులైన మనుషులు వచ్చారు.
       ఆమెను చుట్టుముట్టి హింసిస్తుండగా అడ్డం వచ్చిన అనుచరులందరినీ నరికి చంపారు ఆ క్షణంలో అంకమ్మ శివుని వేడుకుని తన అనుచరులను చంపిన  వారిని సంహరించమని శివుడు తో కోరుకుంది.
     అప్పుడు ఆమె తో శివుడి ఇలా చెప్పాడు అమ్మ నేను ఈ రూపంలో ఎవరిని చంపలేను ఇది జన్మను అందించే రూపం అని చెప్పి అదృశ్యం అవుతాడు తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని రాక్షస జాతిని అంతం చేయాలని ఉద్దేశంతో ఎన్నో యుద్ధ విద్యను నేర్చుకొని త్రిశూలం డమరుకం ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్లి రాక్షసులను సంహరిస్తూ ఉండగా చనిపోయిన వాళ్లంతా కూడా మళ్లీ బ్రతకడం మొదలుపెట్టారు వాళ్లను చంపలేక అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది.
         మళ్ళీ శివుడిని ధ్యానించగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు ఆ క్షణంలో తనకు బిడ్డను ప్రసాదించమని కోరుకోగా ఫలితంగా ఆమెకు మగ బిడ్డ పుడతాడు ఆ పిల్లవాడికి మల్లెం కొండయ్య అని పేరు పెడుతుంది తనే తన దగ్గరున్న అన్ని విద్యలను కూడా బిడ్డకు నేర్పుతుంది సమాజం తండ్రి లేని కొడుకు అని నీచంగా ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ ఇంటికి వచ్చి తల్లినీ నిలదీస్తాడు జరిగిన విషయం అంకమ్మ తన కొడుక్కి చెప్పగా మళ్లీ శివున్ని ధ్యానించడం కోసం అడవికి వెళ్తాడు.
            మల్లెం కొండయ్య కు శివుడు ప్రత్యక్షమై నువ్వు కారణజన్ముడవు నీవు ఒక కార్యం నెరవేర్చాల్సింది అని చెప్పి శివుడు ఆదేశిస్తాడు తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి రాక్షసులను సంహరించడానికి నేను సహకరిస్తానమ్మ అంటూ తల్లికి చెప్పగా ఆ తల్లి రాక్షసులను సంహరించడంమే నా కర్తవ్యం నా లక్ష్యం అంటూ చెబుతుంది .
      అప్పుడు తన సేవకుడైన పోతురాజు ద్వారా ఆయుధాలను సేకరించుకొని తల్లి కొడుకులిద్దరూ కూడా గుర్రాలు ఎక్కి రాక్షసుల పైకి దండయాత్ర చేస్తారు అలా అమ్మ కొడుకు ఇద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉండగా రాక్షసుల రక్తపు బొట్టు కింద పడకుండా ఒక పాత్రలో పట్టుకొని ఆ రక్తంలో ఉన్న జీవాన్ని అంకమ్మ తన నాలుకతో సంహరించేది చివరికి అందరినీ సంహరిస్తారు.
        ఒక రాక్షసుడు మాత్రం పందిలోనికి పరకాయ ప్రవేశం చేస్తాడు ఆ పందిని చంపమని అంకమ్మ చెబితే ఆ పందిని కొండ అంచు నుండి కత్తితో కొట్టగా ఐదు ప్రదేశాల్లో ఆ భాగాలు లింగ రూపంలో పడిపోతాయి వాటిని పంచ లింగాల కోనలు గా చెబుతారు .
        ఆ తర్వాత శివుడు ఆ ప్రాంతంలో ఉన్న దుర్మార్గులను శిక్షించి ప్రజలను కాపాడినందుకు తన ఆలయాన్ని కాపాడినందుకు అంకమ్మను మల్లెం కొండయ్యను దీవించి అక్కడే ఉండమని ఆదేశిస్తాడు తనను భక్తితో సేవించుకొమ్మని శివుడు చెప్పి అంతర్ధానం అవుతాడు ఆ తరువాత తల్లి కొడుకు అక్కడి స్థిరపడిపోయి శివుడి నీ ధ్యానిస్తూ జీవితాంతం అక్కడే తమ జీవితాన్ని కొనసాగించి చివరకు శివుడిలో ఐక్యమవుతారు ఇది ఆలయ చరిత్ర.

 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బ్లాగును చూసినందుకు ధన్యవాదాలు

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...