Saturday, November 12, 2022

బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రీజీ

        ఎన్నో లక్షల మందిని కుదురుగా ధ్యానంలో కూర్చోబెట్టి సమాధానం లేని ప్రశ్నలకు ధ్యానంతో జవాబు చెప్పి మౌనం యొక్క రుచిని జనులకు తెలియజేసి ధ్యానానందాన్ని పంచి పెట్టిన పరమాద్భుతమైన ఆత్మ స్వరూపుడు శ్రీశ్రీ బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గారు .
                 ధ్యానం కోసం జన్మించి జనులకు ధ్యానాన్ని దగ్గర చేయాలని ధ్యానించి నిద్రపోతున్న జ్ఞాన చైతన్యాన్ని మేల్కొలిపి ధ్యాన జీవులను ధన్యజీవులుగా దర్శించి అనంత లోకానికి చేరి ధ్యానులను ఆశీర్వదిస్తున్న కారణజన్ముడు శ్రీశ్రీ సుభాష్ పత్రీజీ గారు బ్రహ్మర్షి, పితామహ అనేవి ఆయన కృషికి ఫలితంగా లభించిన బిరుదులు .
          పత్రి వెంకట రమణారావు సావిత్రి దేవి లకు 1947లో నవంబర్ 11వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్ లోని శంకర్ నగర్ లో జన్మించారు రమణారావు గారు గుడివాడలో జన్మించారు తర్వాత ఉద్యోగరీత్యా నిజమాబాద్ కు వెళ్లారు అలా నిజామాబాద్ శక్కర్ నగర్ లో సుభాష్ గారు జన్మించారు తర్వాత ఆ కుటుంబం వరంగల్ కు మారింది.
       పత్రీజీ గారి తల్లి దయగల వ్యక్తి సంగీతాన్ని ప్రేమించేవారు హిందీలో అనర్గళంగా మాట్లాడేవారు ధ్యానం కూడా చేసేవారు ఎందుకంటే ఆమె గుంటూరులో జన్మించి అలహాబాద్ లో పెరిగింది పదహారేళ్ల వయసులో రమణారావు గారితో పెళ్లయిన తర్వాత భర్త అనారోగ్యంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది అయినా ఆమె పత్రీజీ గారి ఆధ్యాత్మిక ప్రయత్నాలకు ఎంతో సహకరించింది.
          పత్రీజీ గారు శక్కర్ నగర్ లో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు తర్వాత తొమ్మిదవ తరగతి వరకు బోధన్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు తర్వాత సికింద్రాబాద్లో చదువుకున్నారు 1966 లో బీఎస్సీ పూర్తి చేశారు 1970లో ఆదాయపు పన్ను శాఖలో ఇన్స్‌పెక్టర్ గా చేరి 10 నెలలు పనిచేసే రాజీనామా చేసి హైదరాబాదుకు తిరిగివచ్చారు తర్వాత సాయిల్ సైన్స్ లో ఎంఎస్సీ చేశారు 1974లో మే 26న స్వర్ణమాల గారితో వివాహం జరిగింది 1978లో ఒక అమ్మాయి జన్మించగా పరిణిత అని 1982లో మరొక అమ్మాయి జన్మించగా పరిమళ అని పేరు పెట్టారు.
        ఆ బిడ్డలు ఇద్దరూ ఇప్పుడు గొప్ప ధ్యానవేత్తలయ్యారు.
             1975లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కర్నూలులో పనిచేశారు పత్రీజీ గారు 1977 వ సంవత్సరంలో ధ్యానం నేర్చుకున్న తన స్నేహితుడు మరియు సహోద్యోగి శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి సహాయంతో అనాపాన సతి ధ్యానంతో కొన్ని తీవ్రమైన ప్రయోగాలు చేశారు పత్రీజీ .
          1979లో జ్ఞానోదయం పొంది ఆ క్షణం నుండి ప్రతి వ్యక్తిని మేల్కొల్పడానికి మరియు జ్ఞానోదయం పొందేలా చేయడానికి తీవ్రంగా కృషి చేయడం ప్రారంభించి అందులో సఫలీకృతులయ్యారు దాని ఫలితంగా వేల మంది ధ్యానులు తమ జీవితాల్లో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించుకున్నారు.
         శ్రీ పత్రీజీ గారు 50వేలకు పైగా పుస్తకాలు చదివారు ఆ పుస్తకాల సారమంతా ధ్యానమేనని అర్థం చేసుకున్న ఆయన తన జీవితాన్ని ధ్యానంతో ధన్యం చేసుకున్నారు.
        1981లో సదానంద యోగి అనే మహాత్ముడిని కలిశారు ఆయన ద్వారా ధ్యానం నేర్చుకున్నారు ఎన్నో అనుభవాలను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నారు పత్రీజీ గారు.
           సదానంద యోగి గారు అరేబియాలో పుట్టి భారతదేశమంతా తిరిగి చివరికి కర్నూలుకు చేరుకున్నారు చివరకు ఆయన కర్నూలులోనే 1983 మే 22న పత్రీజీ గారి సమక్షంలో దేహాన్ని విడిచిపెట్టారు.
       తర్వాత 1990లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు 1991లో బుద్ధ పిరమిద్యాన కేంద్రం స్థాపించబడింది 1992లో ఉద్యోగానికి రాజీనామా చేసి పి ఎస్ ఎం ని స్థాపించారు శ్రీ పత్రీజీ గారు .
           60 కి పైగా పుస్తకాలు రాశారు ఆయన ఎన్నో వేల వర్క్ షాప్ లు నిర్వహించారు అనాపాన సతి ధ్యానం శాకాహార జగత్తు గురించి ఆయన చేసిన కృషి మరువలేనిది ఇతర దేశాల్లో కూడా పత్రీజీ గారి ధ్యానమార్గాన్ని ఎంతోమంది ఆచరిస్తున్నారు.
          ఆయన కృషికి ఫలితంగా ఎన్నో అవార్డులు వచ్చాయి పిఎస్ ఎస్ఎం అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని హరోహల్లిలోని కెబ్బెదొడ్డి గ్రామంలో ఉంది ఇక్కడ మెగా మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఉంది .
                    ఆయన జులై 24 2022వ సంవత్సరంలో తన ఆత్మని శాశ్వతంగా ధ్యాన లోకంలోనికి ప్రవేశపెట్టారు లక్షల హృదయాల్లో ధ్యాన నివాసం ఏర్పరచుకున్న పరమాద్భుత ధ్యానయోగి బ్రహ్మర్షి పితామః పత్రీజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ.......
 సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...