1858లో ధార్వాడ్ జిల్లా రాం అనే ప్రాంతంలో నివసించే లింగన్న గౌడ మరియు బసవమ్మ అనే పుణ్య దంపతులు దైవభక్తి దయ సద్గుణాలతో జీవించేవారు వారి దాంపత్య ఫలితంగా ఒక సకల సద్గుణాలు కలిగిన బాలుడు జన్మించాడు ఆ బాలుడికి శివానంద అని పేరు పెట్టారు మౌన స్థితిని అనుభవిస్తూ తనలో తాను ఆత్మానందంలో మునిగి ఉండేవాడు ఒక వ్యక్తి ఒకసారి శివానంద దగ్గరకు వచ్చి ముక్కలు ముక్కలుగా శివానందను నరికేస్తానని చెప్పాడు అప్పుడు శివానంద తన మెడను వంచి తనకు శరీరమే లేదని చెప్పి ఆ మెడను పూర్తిగా కత్తిరించమని చెప్పాడు అది ఆయన చిన్నప్పటి స్థితి .
శివానందకు తల్లిదండ్రులు ఒక చిన్న అమ్మాయితో వివాహం జరపడానికి నిశ్చయించారు అయితే శివానంద మాత్రం తనను పెళ్లి చేసుకున్న అమ్మాయి కొద్దిసేపటికే మరణిస్తుంది అని చెప్పాడు తనకు వివాహం చేయవద్దని వారించాడు కానీ పెద్దలు వివాహం జరిపించగా కొద్దిసేపటికే అమ్మాయి మరణించింది అప్పుడు శివానంద సామాన్యుడు కాదని జరగబోయే విషయం ముందే గ్రహించిన మహాత్ముడు అని కొందరు భావించారు.
ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి కొంతవరకు ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు ధార్వాడ జిల్లా నవల గుండ తాలూకాలోని ధోని ముందరంగి తాలూకాలోని డుంబల్ గ్రామాల సమీపంలో కనారస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు అప్పుడు కూడా అతను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక బ్రహ్మానందంలో లీనమై జీవించేవాడు శివానంద గారు బనహట్టి గ్రామానికి చెందిన శ్రీ రుద్ర స్వామి మహరాజ్ అనే గొప్ప సాక్షాత్కార సాధువుతో పరిచయం కలిగి ఉండటం వల్ల వారు ఇద్దరూ అప్పుడప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవారు.
తర్వాత శివానంద గారు రామదుర్గ జిల్లా బెల్గాంలోని మనీ హాల్లో 12 సంవత్సరాలు పోలీసు పాటిల్ గా పనిచేశాడు అయితే ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో ఆయన పోలీసు బాధ్యతలను నిర్వర్తించేవాడు అతడు డ్యూటీ అయిన తర్వాత మనిగేరమ్మ కొండపైకి వెళ్లి ఆత్మ తత్వాన్ని పరిశోధించేవాడు తల్లిదండ్రులు శివానంద గారికి రెండవ వివాహం చేయగా 194వ సంవత్సరంలో శివానంద దంపతులకు మగ పిల్లవాడు జన్మించగా నింగన గౌడ అని పేరు పెట్టారు భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వర్షాన్ని చూస్తూ ఆత్మానుభూతిని తనలో తానే అనుభవించేవాడు ఒకసారి అలా కళ్ళు మూసుకుని ఇంటిలో ధ్యానస్థితిలో కూర్చున్నాడు ఐదు గంటలపాటు ఎర్రటి చీమలు శివానంద ఒళ్లంతా పాకి ఆయనను కరుస్తున్నాయి కానీ ఆ స్థితిలో వాటి స్పర్శ ఆయనకు తెలియనే లేదు తాను ఎప్పుడైనా దేవాలయానికి వెళితే ధ్యానస్థితిలో లీనమయ్యేవారు.
ఒకసారి మణిగేరమ్మ కొండపై ధ్యానస్థితిలో లీనమయ్యారు శివానంద గారు ఆ సమయంలో అప్పటి రామదుర్గ సంస్థానానికి చెందిన రాజా సాహెబ్ గారు తన పరివారంతో కలిసి అటుగా వెళుతూ ధ్యాన స్థితిలో ఉన్న శివానందను చూసి ఎవరితను అని తన పరివారాన్ని అడిగాడు అతని విషయాలను రాజా సాహెబ్ కు కొందరు వివరించారు ధ్యానస్థితిలో ఉన్న అతని చుట్టుపక్కల ముళ్ళపదలు క్రూర మృగాలు ఉన్నాయి శివానంద గారిని కదల్చడానికి గంతో పక్కకు కాల్చాడు కానీ శివానందలో కదలికే లేదు కొన్ని రోజుల తర్వాత శివానందను ఆ రాజు కలసి ఈరోజు ఏమి జరిగిందో ఆరోజు ఏమి జరిగిందోనని చెప్పమన్నాడు అయితే ఆత్మానందంలో మునిగి ఉన్నప్పుడు బయట విషయాలేవీ వినపడవు ఆరోజు ఏమి జరిగిందో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు.
శివానంద గారు ఒకసారి ఆయన ధ్యానస్థితిలో ఆత్మానందంలో మునిగి ఉన్నప్పుడు ఒక నాగుపాము ఆయన తొడ పైకి ఎక్కి కూర్చున్నది కానీ శివానంద గారు ఆ సమయంలో ఒక రాయితో సమానంగా కూర్చున్నారు శివానంద గారు మైసూరు సమీపంలోని శంభు లింగ కొండకు వెళ్తూ ఉండగా అతని శిష్యులు మరియు భక్తులు శివానంద స్వామి గారిని ఒప్పించి 195వ సంవత్సరంలో నాగనూరుకు వచ్చేలా చేసి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. ఆ ఆశ్రమంలోనే నిరంతర అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఒక్కోసారి రెండు మూడు రోజులు ఆహారం లేకుండా సమాధి స్థితిలో నిలిచేవారు శ్రీ సిద్ధారుడులే స్వయంగా శివానంద వారిని గురించి ఇలా అన్నారు ఈ శివానంద ఆధ్యాత్మిక పరిపూర్ణతను కాపాడుకుంటూ లౌకిక లావాదేవీలను న్యాయంగా ధర్మ బద్ధంగా కొనసాగించగలిగే శక్తిని కలిగిన వాడు అని చెప్పాడు ఒకసారి శ్రీ శివానంద స్వామిని శ్రీ సిద్ధారు డి స్వామితో పాటుగా పల్లకి బండ్లలో ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్లారు మరియు ఇతర ప్రాంతాల నుంచి తన వద్దకు వచ్చే ప్రజల కోరిక మేరకు శివానంద గారు అక్కడ ఉండడానికి గడక్కు వెళ్లారు ఆయన ప్రతిరోజు దినచర్య ఏమిటంటే ధ్యానం కోసం కూర్చోవటం స్వీయ చింతనలో ఆనందించటం రోజుకు మూడుసార్లు బోధించడం.
ఒకసారి శివానంద గారు విష ప్రభావానికి గురైనారు విశ్రాంతి కోసం వైద్యం కోసం నాగనూరుకు తీసుకెళ్లారు అంత తీవ్రమైన అనారోగ్య స్థితిలో కూడా అతన్ని చూడడానికి వచ్చినవారికి ఆధ్యాత్మిక విషయాలను వివరించేవారు శివానంద గారి జీవితం ఏ సాంప్రదాయాలు కులాలు, మతాలు మొదలైన వాటికి పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తూ గడిచింది స్వామిని తిరిగి గడక్ తీసుకువచ్చారు ఆయన అనారోగ్యం తీవ్రతరమైనది కానీ ఆయన ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అలాంటి ప్రశాంతమైన స్థితిలో 80 సంవత్సరాల వయసులో 1939 అధిక శ్రావణమాసంలో జులై ఒకటవ తేదీన బ్రహ్మ ముహూర్తంలో తనువు చాలించారు అటువంటి పరమ పవిత్రమైన జీవితాన్ని సాగించి ఎంతోమంది భక్తుల హృదయాలలో నిలిచిపోయిన శ్రీశ్రీశ్రీ శివానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్
No comments:
Post a Comment