కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని సింధనూర్ పట్టణంలోని జవలగేరి గ్రామంలో జన్మించాడు శ్రీశ్రీశ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి వారు. అతి చిన్న వయస్సు నుండి యోగి లక్షణాలతో సంచరించేవారు
చిన్నతనం నుండే అద్భుతాలు చేస్తూ మహిమలు చూపుతూ ప్రజలకు సహాయం చేసేవారు అలా యోగిలా సంచరిస్తూ ధార్వాడ్ లోని మౌనేశ్వర గుహలో స్థిరపడ్డాడు.
ఆయన చర్యల వల్ల ఆ కాలంలో అంటే 19వ శతాబ్దంలో ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ప్రాచుర్యం పొందారు. విశ్వకర్మ కుటుంబంలో మౌనాచర్య నాగమ్మ దంపతులకు 1812 వ సంవత్సరంలో జన్మించారు నాగలింగ స్వామి వారు .
ఆయన పోలికలు ఏసుక్రీస్తుతో పోలి ఉంటాయి ఆలయ గోడలపై ఉండే ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు కాస్త ఏసుక్రీస్తును తలపింప చేస్తుంది అయితే స్వామివారి యొక్క ఆలయంలో ప్రస్తుతం ఒక బైబిల్ గ్రంధం పూజించబడుతూ ఉంది ప్రతిరోజు ఆలయ పూజారి హిందూ సంప్రదాయం ప్రకారం పూజ చేసి ప్రదర్శన కోసం ఆ బైబిల్ ని ఉంచుతారు ఆ ఆలయానికి వచ్చిన ప్రతిభక్తుడు తన ప్రార్థనలను బైబిల్ కు కూడా చెల్లిస్తాడు బైబిల్ చదవబడదు కానీ అది ఇక్కడ చాలా పవిత్రమైనది ఇది చర్చి కాదు ఒక హిందూ దేవాలయం మాత్రమే.
అయితే ఆ బైబిల్ స్వామి గర్భగుడిలోకి చేరి పూజించబడటానికి ఒక కారణం ఉంది అదేమిటంటే ఒకప్పుడు కర్ణాటకలోని భాగం జిల్లాలోని బాదామి పట్టణంలో ముష్టిగేరి గ్రామంలో కాలప్ప అనే గొప్ప దేవి భక్తుడు నివసించేవాడు ఒకసారి ఆయన బైబిల్లో ఏముందో అని తెలుసుకోవడం కోసం బైబిల్ ను చదువుతూ ఉండగా శ్రీ నాగ లింగస్వామి కాలప్పను కలిశారు కాలప్ప చేతిలో ఉన్న బైబిల్ ను తీసుకొని దానిపై ఒక చిన్న హుక్కు సహాయంతో రంద్రం చేశాడు విక్టోరియన్ వెండి నాణిెం ఆ చిల్లులో పడేశాడు అవతలి వైపు నుండి మరొకవైపుకు సాఫీగా బయటకు వచ్చింది ఆ నాణెం ఆ రంద్రం దానంతట అదే పూర్తిగా మూసుకుపోతుందని అలా జరిగినప్పుడు మళ్ళీ వేరే అవతారంలో పుడతాడని కాలప్పకు మరుజన్మ వృత్తాంతం తెలియజేసి వెళ్ళాడు ఆ తర్వాత బైబిల్ పై తప్పిపోయిన పదాలు అద్భుతంగా మళ్ళీ కనిపించాయి నేటికీ రంధ్రం సూది పరిమాణంలో ఉంది .
నాగలింగ యోగి గారు 1881 వ సంవత్సరంలో తనువు చాలించిన తర్వాత దివంగత కాలప్ప ఆలయానికి ఆ బైబిల్ ను ఇచ్చేశాడు అలా ఆలయంలో బైబిల్ మరియు వెండినానం భద్రపరచబడ్డాయి ఆలయ అధికారుల అనుమతితో ఎవరైనా ఆ బైబిల్లో సందర్శించవచ్చ ఈ ఆలయంలో ముస్లింల పండుగ మొహరంలో ఉపయోగించే పంజా అనే కత్తి మరియు చనిపోయిన వారిని స్మశాన వాటికకు తీసుకెళ్లడానికి ఉపయోగించే సిదగి అనే బండి వంటి కొన్ని ఆసక్తికరమైన వస్తువులు కూడా ఉన్నాయి ఇలాంటి ఇతర మతాలకు చెందిన వస్తువులు ఏ ఇతర హిందూ దేవాలయాల్లో మనం చూడలేము కానీ శ్రీ నాగలింగ స్వామి వారి మఠంలో మాత్రం మనం క్రైస్తవ మతానికి చెందిన బైబిల్ ను ఇస్లాం మతానికి చెందిన సిధకి పంజాలను గమనించవచ్చు.
శ్రీ నాగలింగ స్వామి వారు ఆ సిదగి అనే బండిని తాను బ్రతికి ఉన్నప్పుడు ఉపయోగించడం వలన ఆ బండిని ఆలయంలో ఉంచారు ఒకసారి స్వామి వారు తిరిగి పైకి ఎక్కి కూర్చుని విద్యార్థులకు చెప్పి ఊరేగించమన్నారు చాలా మంది వ్యతిరేకించారు కానీ స్వామికి ఎదురు చెప్పలేకపోయారు ఈ దేవాలయం లో మొహరం కూడా ఘనంగా జరుపుతారు.
శ్రీ నాగలింగ స్వామి వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులను ఆకర్షించారు తన దగ్గరికి వచ్చిన భక్తులను ఎన్నో విధాలుగా తన బోధనల ద్వారా ప్రేరేపించారు మరియు తన బోధనల ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోనికి ఎంతో మందిని మళ్లించేవారు యుద్ధం చేయడం కంటే శాంతిని నెలకొల్పటం చాలా ముఖ్యమని బోధించేవారు శ్రీ నాగలింగ స్వామి వారు. సర్వేజనా సుఖినోభవంతు
ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment