శ్రీశ్రీశ్రీ అవధూత మాల పిచ్చమ్మ అవ్వగారు ఆంధ్రప్రదేశ్ గుడివాడకు దగ్గరలో ఉండే కురుమద్దాలి అనే గ్రామంలో 1870 వ సంవత్సరంలో వడ్డ ముత్తయ్య వీరమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. అయితే ఈమె చిన్నప్పటినుంచి తన లోపల తాను లీనమై ఏదో మాట్లాడుకుంటూ ఉండేది అంతేకాదు ఏవేవో ఆవిడకి శబ్ద నాదాలు వినపడుతూ ఉండేది ఒకసారి ఆమె ఒక కట్టెలాగా నిచ్చేస్తూ రాలైపోయింది అలా కట్టేలాగా బిగుసుకుపోయినప్పుడు చాలా రోజులపాటు అలాగే సమాధి స్థితిలో నిలిచిపోయింది కానీ అందరూ కూడా ఆమెకు ఏదో జరిగింది అంటూ వైద్యం చేయించారు అయినా కూడా ఆమె స్థితిలో మార్పు రాలేదు. అయితే ఒకసారి తల్లి అడిగింది అమ్మ నువ్వు ఎందుకలా ఉన్నావు అంటూ అడగ నాకు ఏవేవో వేణు నాదాలు అన్నీ కూడా వినిపిస్తున్నాయి నాకు తెలియకుండానే ఇలా జరుగుతుంది అనుకోకుండా నేను నా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఆగిపోతున్నాయి అందుకే నేను ఇలా మారిపోతున్నాను అంటూ చెప్పింది ఇక తన బిడ్డ యొక్క స్థితిని గమనించిన తల్లి తన బిడ్డకు ఏమవుతుందో అనే భావనతో పెళ్లి చేశారు అయితే పిచ్చమ్మ గారికి పెళ్లి అయిన తర్వాత కొన్ని నెల తర్వాత భాగ్యమ్మ అనే ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండగా పిచ్చమ్మ గారి భర్త మరణించాడు అంత కష్టంలో కూడా తన బిడ్డ పై ప్రేమతో చక్కగా పెంచి పెద్ద చేసింది ఒకానొక దశలో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది కానీ అనుకోకుండా అల్లుడు కొన్ని రోజులకే చనిపోయాడు తన బిడ్డను అలా చూసి తట్టుకోలేక బలవంతంగా రెండవ పెళ్లి చేసింది కానీ రెండవ అల్లుడు కూడా ఆమెను విపరీతంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే పిచ్చమ్మ గారి కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇలా ఎన్నో కష్టాల మధ్య ఆమెకు జీవితం అంటే వైరాగ్యం కలిగింది పిచ్చమ్మకు అనుకోకుండా కురుమద్దాలి గ్రామంలో ఒక గురువు ద్వారా మంత్రోపదేశం జరిగింది ఇక ఆ తర్వాత సాధన చేస్తూ భావ సమాధి స్థితిలోనికి చేరుకొని తాను ఇంటి నుంచి స్మశానాన్ని లోకి వెళ్లి అక్కడే నివసించ సాగింది దిగంబర జీవితాన్ని ఎన్నుకొని తాను సాధన చేస్తూ ఉండేది ఆకలి వేసినప్పుడు బస్మాన్ని బూడిదను తింటూ ఉండేది ఆవిడ స్మశానంలో ఉన్నప్పుడు ఎన్నో పాములు ఆమె మీద నుంచి పాకేవి అయినా కూడా దేహ బ్రాంతి విడిచి చెల్లించేది కాదు తర్వాత ఆమె పరిస్థితిని గమనించిన కొంతమంది వ్యక్తులు ఆమె మహాత్మురాలని భావించి ఆమెకు 1925లో ఆశ్రమాన్ని నిర్మించారు ఆ తర్వాత తనను నమ్మిన వచ్చి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆమె అనేక తత్వ బోధలు చేస్తూ ఉండేది అయితే అనుకోకుండా ఆమెను కొంతమంది తీర్థయాత్రలకు తీసుకెళ్లారు వచ్చిన తర్వాత తన లోపల ఉన్న దేవుడే కమ్మగా ఉన్నాడు వేరెక్కడి దేవుడు కమ్మగా లేడు అంటూ భక్తులతో పలికింది శ్రీ అమ్మవారు 19501లో జనవరి 15న తన దేహ త్యాగం చేశారు ఎంతో మందికి తత్వ జ్ఞానాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక మార్గంలోనికి రావడానికి ఆవిడ జీవితాన్ని ధారపోశారు అటువంటి పరమ పవిత్రమైన పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ....
సర్వేజనా సుఖినోభవంతు
జై గురుదత్త
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ అమ్మగారికి తన భర్త ఎప్పుడు చనిపోతాడో ముందే తెలుసు అంతే కాదు శ్రీ అమ్మవారు గాంధీ గారిని తన కొడుకుగా భావించేవారు తన దర్శనానికి మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు ఆయనతో ప్రేమగా సంభాషించింది శ్రీ మహాత్మా గాంధీ గారు చనిపోయే రోజు తన భక్తులతో ఆ విషయాన్ని గురించి ముందే చెప్పింది ఇలా ఎన్నో మత్యాలను చూపిన అమ్మ శక్తి నేటికీ ఆమెను నమ్మినవారికి అందుతూనే ఉంది
No comments:
Post a Comment