శ్రీ అవధూత మిట్టపాలెం నారాయణస్వామి గురించి తెలుసుకుందాం రండి ఒంగోలు జిల్లా మిట్టపాలెం గ్రామానికి చెందిన శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి భారతీయ నోస్ట్రడామస్గా తన భక్తుల చేత పిలువబడ్డారు ఆసామాన్యమైన తెలివితేటలు ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి శ్రీ అవధూత మిట్టపాలెం నారాయణ స్వామి వారు హిందువులే కాకుండా అన్ని మతాలకు కులాలకు చెందిన భక్తులు ఆయనకున్నారు దళిత వర్గానికి చెందిన మహాత్ముడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు వెంకటరామయ్య లక్ష్మమ్మ దంపతుల మూడవ సంతానంగా ఈయన జన్మించారు అయితే పుట్టినప్పుడు కొండయ్య అని పేరు పెట్టారు చిన్నతనం నుండే సాధువులతో కలిసి తిరుగుతూ యోగ సాధన ధ్యాన సాధన నేర్చుకున్నారు 1700 సంవత్సర ప్రారంభంలో తన తల్లిదండ్రులు మరణించగా ఇక ఆ తర్వాత ఆయన నారాయణపురంలో ఉండే నారకొండ పైకి వెళ్లి అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు.
ఆ తర్వాత సిద్ధి పొంది ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆయనను నారాయణస్వామిగా అందరూ కూడా పిలిచేవారు ఆయన మహాత్ముడిగా ఎదిగిన తర్వాత ఆయనను చూసిన కొంత మంది అగ్రవర్ణాల వారు అసూయపడేవారు ఎన్నో రకాల అవమానాలను చేయాలని ప్రయత్నించేవారు భగవంతుడి కృప కారణంగా అతడు రక్షించబడ్డాడు కర్రలతో ఆయనను కొట్టబోతే ఆ కర్రలు పాములుగా మారేవి ఆయనను చంపడం కోసం బావిలో పడేశారు. అయినా కూడా ఆయనకు ఏమీ జరగలేదు ఎంతోమంది భక్తులు నారాయణస్వామి పై నమ్మకంతో తమ కర్మల బాధ నుండి విముక్తి కోరుతూ ఆయన పాదాల చెంత వద్దకు చేరుకునేవారు వారిని ఆశీర్వదించి ఎన్నో మంత్రాలను బోధించేవాడు ఆధ్యాత్మిక విషయాలను వారికి చెప్పేవారు కాలం మత్తులో ఇరుక్కున్న అహంకారులకు ఆయన కాళహస్తి రాజు ఆస్థానంలో దోషిగా నిలబెట్టారు బ్రాహ్మణులకు ధర్మాన్ని బోధిస్తున్నాడని కోపంతో ఆ రాజు నారాయణస్వామిని జైల్లో పెట్టించాడు అయినా భగవంతుడే స్వామి వారిని క్షేమంగా బయటపడేలా చేశాడు తర్వాత ఆ లీల తెలుసుకున్న రాజు క్షమాపణ కోరుకున్నాడు అవధూత అని పిలిచి అసమం కోసం చంద్రశేఖరపురంలో కొంత భూమిని మంజూరు చేశాడు స్వామి 1750 లో సమాధి పొందారు ప్రకాశం జిల్లా చంద్రశేఖర మండలం కనిగిరి తాలూకా మిట్టపాలెం లో సమాధి పొందారు .
ఆలయ ప్రాంగణంలో మూడు వారాలు నిద్రిస్తే కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తారు శారీరక మానసిక ఆధ్యాత్మిక బాధలతో బాధపడే వారిని రక్షించే రక్షకుడు శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారు తపస్సు చేసి హృదయ స్వచ్ఛత పొందడం ద్వారా దైవానుగ్రహం లభించి కర్మను అధిగ మించవచ్చు అని సందేశాన్ని ఇచ్చారు ఆయన ప్రజలు ఎక్కువగా ఆదివారం సందర్శిస్తారు మరియు నేలపై పడుకుని నిద్రపోతారు చర్మ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా సోరియాసిస్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ ప్రదేశానికి వెళ్తారు చనిపోయిన వ్యక్తుల్ని ఎంతో మందిని శ్రీ స్వామి వారు బ్రతికించారు తన జీవితాన్ని ప్రజాసేవకు ఆధ్యాత్మిక సేవకు అంకితం చేసిన పవిత్రమైన ఆ పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ .....
సర్వేజనా సుఖినోభవంతు జై గురుదత్త ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment