ఒకరోజు అనుకోకుండా ఆ ఊరికి ఇద్దరు సాధువులు వచ్చారు వారు ఎంతో దాహంతో ఉన్నారు ఎంతమందిని అడిగినా ఎవరూ కూడా వారి దాహం తీర్చలేదు శ్రీ బల్లప్ప గారు అత్యంత లోతైన బావిలోనికి చాలా ఇబ్బంది పడుతూ కష్టం మీద దిగి ఆ ఇద్దరు సాధువుల యొక్క దాహాన్ని తీర్చాడు ఆ సమయంలో ఆ బిడ్డ యొక్క గొప్పదనానికి సాధువులు సంతోషించి అనంతమైన దివ్య శక్తిని అతని లోనికి ప్రవేశింప చేశారు తర్వాత ఆయన భావ సమాధికి చేరుకొని మహాత్ముడిగా ఎదిగాడు ఆయన చందుసేట్ ఇంటిలో పనికి చేరేటప్పుడు చందు సేటు గారి ఆవు పాలు ఇచ్చేది కాదు శ్రీ స్వామివారి చెయ్యి తగిలిన మరుక్షణమే ఆ ఆవు పాలిచ్చింది అంతేకాదు వైద్యం కోసం డబ్బులు లేక తమ చిన్నారి యొక్క బాధను చూసి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న తల్లిదండ్రులను చూసి బాధపడి నేలపై కర్రతో కొట్టాడు డబ్బు ప్రత్యక్షమైంది వాళ్లు స్వామికి నమస్కరించి ఆ డబ్బుతో తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నారు.
శ్రీ బాలు మామ గారికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు అయితే బాలు మామ తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ చుట్టూ ఒక వలయాన్ని గీశారు ఆ వలయాన్ని దాటవద్దని చెప్పారు కానీ ఆమె ఆయన మాట వినలేదు భాష్యం జరిగి బిడ్డ చనిపోయారు ఆ కోపంతో ఆయన ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు అయితే ఆయన అలా వెళ్ళిపోయి ఒక సద్గురువు కోసం వెతకడం ప్రారంభించారు పండరీపూర్ కు వెళుతూ ఉండగా వేణునాదం ఊదుతూ ఒక వ్యక్తి ఆయనకు ఎదురుపడ్డాడు తనకు 120 రూపాయలు ఇవ్వమని అడిగాడు ఆ సమయంలో బాలు మామ దగ్గర 120 రూపాయలు మాత్రమే ఉంది శ్రీ స్వామివారికి చెల్లించారు అప్పుడు ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆధ్యాత్మిక దీక్షను ప్రసాదించారు ఆయనే శ్రీ బాలకృష్ణ మూలే అని మహాత్ముడు 1966లో కొల్లాపూర్ జిల్లాలోని ఆదమాపూరులో శ్రీ బాలు మామ మరణించారు తన భక్తులు హృదయంతో పిలిస్తే సహాయం కోసం వస్తానని వాగ్దానం చేసి ఆయన దేహత్యాగం చేశారు 74 సంవత్సరాల పాటు జీవించి ఎంతోమందిలో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించారు శ్రీ బాలు మామ వారు.
ఆయన ఆలయం మహారాష్ట్రలో కూడా నిర్మించారు ఎంతోమంది కర్ణాటక మహారాష్ట్రల్లో ఆయనకు భక్తులు ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా ఆయన ఆరాధన ఉత్సవాలు ఏడు రోజులపాటు జరుగుతాయి ఆయన ముఖ్యంగా బోధించినవి
జంతువులను చంపవద్దు.
మీ కర్మకు మీరే బాధ్యులు .
చెడుకు దూరంగా ఉండండి ....అంటూ బోధించాడు పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపిన పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ...
సర్వేజనా సుఖినోభవంతు
జై గురుదత్త
ఓం శ్రీ గురుభ్యోనమః
No comments:
Post a Comment