Saturday, August 26, 2023

మహాయోగి శ్రీశ్రీశ్రీ సద్గురు బాలు మామ దివ్య చరిత్ర

      మహాయోగి శ్రీ సద్గురు బాలు మామ జీవితం గురించి తెలుసుకుందాం రండి ....శ్రీ బాలు మామ అనే ఈ యోగి ఒక గొప్ప సాధువు మరియు ఆధ్యాత్మికవేత్త ఈయన గొర్రెలతో జీవనం గడిపేవాడు తర్వాత ఆధ్యాత్మిక చైతన్యం కలిగి తపస్సుతో జీవితాన్ని మార్చుకున్నాడు ఎన్నో అద్భుతాలతో పాటు ప్రజలకు సహాయం చేసేవారు కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈయన శ్రీ పాండురంగ స్వామికి భక్తుడిగా కీర్తించబడ్డాడు 1892 వ సంవత్సరం అక్టోబరు మూడవ తేదీన కర్ణాటకలోని బెల్గాం జిల్లా చికోడి తాలూకా అనే గ్రామంలో జన్మించారు సత్యవా మాయప్ప అనే పుణ్య దంపతులకు సంతానంగా ఈయన జన్మించగా బల్లప్ప అని తల్లిదండ్రులు పేరు పెట్టారు చిన్నతనంలో  బల్లప్ప ఎవరి శిక్షణా లేకుండా ధ్యానం చేస్తూ ఉండేవాడు అయితే తల్లిదండ్రులు వద్దని వారించేవారు అతన్ని వాలకం చూసి భయపడి ఒక పని ఉంటే బాగుండు కదా అనే ఉద్దేశంతో అతడికి చందూసేటనే ఒక వ్యక్తి దగ్గర ఇంటిలో పనిచేయడానికి పంపారు ఆ చందు సేట్ గొర్రెలను మేపమని చెప్పేవాడు ఎంతో ఆనందంగా తాను చేస్తున్న పనిమీద ఇష్టంతో గొర్రెలను మేపేవాడు అయితే అతను తినే ప్లేట్లో ఒకసారి చందు సేటు గారు అద్భుతాన్ని చూశారు ఆ తర్వాత బల్లప్ప ప్లేటును లాక్కొని దానికి పూజ చేయడం మొదలు పెట్టాడు ఒకసారి బల్లప్ప తన ప్లేటు తనకు ఇవ్వమని అడిగాడు కానీ చందు సేటు ఇవ్వనన్నాడు అలా ఎప్పుడైతే ప్లేటు ఇవ్వలేదు ఇక అక్కడి నుంచి పనిచేయకుండా వెళ్లిపోయాడు మల్లప్ప ఆ తర్వాత అతను తన మేనమామతో కలిసి జీవించేవాడు మేనమామ కొడుకులు అతన్ని బాలు మామ అంటూ పిలిచేవారు అదే కార్యక్రమం లో శ్రీ బాలు మామగా ఆయనకు ఆపాదించబడింది.
      ఒకరోజు అనుకోకుండా ఆ ఊరికి ఇద్దరు సాధువులు వచ్చారు వారు ఎంతో దాహంతో ఉన్నారు ఎంతమందిని అడిగినా ఎవరూ కూడా వారి దాహం తీర్చలేదు శ్రీ బల్లప్ప గారు అత్యంత లోతైన బావిలోనికి చాలా ఇబ్బంది పడుతూ కష్టం మీద దిగి ఆ ఇద్దరు సాధువుల యొక్క దాహాన్ని తీర్చాడు ఆ సమయంలో ఆ బిడ్డ యొక్క గొప్పదనానికి సాధువులు సంతోషించి అనంతమైన దివ్య శక్తిని అతని లోనికి ప్రవేశింప చేశారు తర్వాత ఆయన భావ సమాధికి చేరుకొని మహాత్ముడిగా ఎదిగాడు ఆయన చందుసేట్ ఇంటిలో పనికి చేరేటప్పుడు చందు సేటు గారి ఆవు పాలు ఇచ్చేది కాదు శ్రీ స్వామివారి చెయ్యి తగిలిన మరుక్షణమే ఆ ఆవు పాలిచ్చింది అంతేకాదు వైద్యం కోసం డబ్బులు లేక తమ చిన్నారి యొక్క బాధను చూసి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న తల్లిదండ్రులను చూసి బాధపడి నేలపై కర్రతో కొట్టాడు డబ్బు ప్రత్యక్షమైంది వాళ్లు స్వామికి నమస్కరించి ఆ డబ్బుతో తమ బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నారు. 
       శ్రీ బాలు మామ గారికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు అయితే బాలు మామ తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ చుట్టూ ఒక వలయాన్ని గీశారు ఆ వలయాన్ని దాటవద్దని చెప్పారు కానీ ఆమె ఆయన మాట వినలేదు భాష్యం జరిగి బిడ్డ చనిపోయారు ఆ కోపంతో ఆయన ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు అయితే ఆయన అలా వెళ్ళిపోయి ఒక సద్గురువు కోసం వెతకడం ప్రారంభించారు పండరీపూర్ కు వెళుతూ ఉండగా వేణునాదం ఊదుతూ ఒక వ్యక్తి ఆయనకు ఎదురుపడ్డాడు తనకు 120 రూపాయలు ఇవ్వమని అడిగాడు ఆ సమయంలో బాలు మామ దగ్గర 120 రూపాయలు మాత్రమే ఉంది శ్రీ స్వామివారికి చెల్లించారు అప్పుడు ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆధ్యాత్మిక దీక్షను ప్రసాదించారు ఆయనే శ్రీ బాలకృష్ణ మూలే అని మహాత్ముడు 1966లో కొల్లాపూర్ జిల్లాలోని ఆదమాపూరులో శ్రీ బాలు మామ మరణించారు తన భక్తులు హృదయంతో పిలిస్తే సహాయం కోసం వస్తానని వాగ్దానం చేసి ఆయన దేహత్యాగం చేశారు 74 సంవత్సరాల పాటు జీవించి ఎంతోమందిలో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించారు శ్రీ బాలు మామ వారు.
     ఆయన ఆలయం మహారాష్ట్రలో కూడా నిర్మించారు ఎంతోమంది కర్ణాటక మహారాష్ట్రల్లో ఆయనకు భక్తులు ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా ఆయన ఆరాధన ఉత్సవాలు ఏడు రోజులపాటు జరుగుతాయి ఆయన ముఖ్యంగా బోధించినవి 
  జంతువులను చంపవద్దు. 
   మీ కర్మకు మీరే బాధ్యులు .
   చెడుకు దూరంగా ఉండండి ....అంటూ బోధించాడు పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపిన పుణ్యమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ...
 సర్వేజనా సుఖినోభవంతు
 జై గురుదత్త
 ఓం శ్రీ గురుభ్యోనమః

No comments:

Post a Comment

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...