Monday, September 4, 2023

నేను రాసుకున్న ఆధ్యాత్మిక కథ

  అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండే జ్ఞాన దాసు అనే ఒక మహాత్ముడు కాలువలో స్నానం చేస్తున్నప్పుడు దేవుడిని నమ్మని కైవల్య అనే వేటగాడు పరమ నాస్తికుడు ఆ మహాత్ముడు స్నానం చేసే విషయాన్ని గమనించి అతని వైపు ప్రవహించే నీటిలో తన మలాన్ని విసర్జించాడు.
       అది ఆ మహాత్ముడు చూస్తూనే ఉన్నాడు తనలో తానే నవ్వుకుంటూ చాలాసేపు స్నానం చేసి దోసిలితో కడుపునిండా ఆ నీళ్లనే తాగి తన ఆశ్రమానికి వెళ్ళి పోయాడు.
     ఏదో తెలియని ఆలోచన వచ్చింది వేటగాడు ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో వెళుతుండగా అతని మదిలో అదే ఆలోచన బయలుదేరింది మలం పారిన నీటిలో స్నానం చేసిన మహాత్ముడు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ అడవి దారికుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒకచోట లోయలో పడిపోతాడు గట్టిగా అరిచేసరికి అదే లోయలో ఒక గుహలోనుండి జ్ఞాన దాసు గారు బయటికి వస్తారు కైవల్య అంటూ గాయాలతో మూలుగుతున్న వ్యక్తిని పిలిచి అక్కడి నుంచి తీసుకెళ్లి తన గుహలో వారం రోజులపాటు నిద్రాహారాలు లేకుండా సపర్యలు చేస్తాడు జ్ఞానదాసు స్వామి.
       స్పృహలోకి వచ్చిన తర్వాత వారం రోజులు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాన దాసు స్వామిని నిస్వార్ధంగా చేసిన సేవలు అతని కాటిణ్యమైన హృదయాన్ని కరిగించి వేశాయి.
     కొండలను సైతం కదిలించే శక్తి కలిగిన వారికి బండ రాయి లాంటి గుండెను కదించటం వింతేమీ కాదు.
         నాకు మీరు ఎందుకు సేవలు చేశారు మలం కలిసిన నీటిని ఎందుకు చిరునవ్వుతో తాగారు అని ప్రశ్నించగా అప్పుడు కైవల్యకు జ్ఞాన దాసుగారు ఇలా సమాధానం చెప్పారు.
      నాకు మలమూ మల్లెపువ్వుకు తేడా తెలియదు నా దృష్టిలో రెండు సమానమే అందుకే నాకు ఏ రుచి ఏ వాసన తెలియదు భగవంతుడి రుచి భగవంతుడి వాసనా భగవంతుడు స్పర్శ భగవంతుడు దర్శనం నిరంతరం అనుభూతి చెందుతున్నాను ప్రతి ప్రాణిలో ప్రకృతి అంతా భగవంతుడే అన్న అనుభవ సత్యం అవగతం చేసుకున్నప్పుడు భగవంతుడు కానిది ఏదీ లేదు అని చెప్పగా తన కన్నీటితో జ్ఞానదాసు స్వామి కాళ్ళను కడిగి తనని శిష్యునిగా చేర్చుకోమని జ్ఞానోపదేశం చేయమని వేడుకుని శిష్యుడిగా మారిపోయాడు.
     ఆపై కైవల్య దాసుడిగా, భక్తుడిగా మారిపోయి నిరంతరం దైవ ధ్యానంలో కలిపి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు

మాత అమృతానందమయ్య చరిత్ర

   కేరళలోని కొల్లాం జిల్లా కరుణాగపల్లిలోని అలప్పాడ్ పంచాయతీలోని పరాయికడవు అనే గ్రామంలో నివసించే మత్స్యకార దంపతులైన సుగుణానందన్, దమయంతి లకు మూడవ సంతానంగా సెప్టెంబర్ 27 1953వ సంవత్సరంలో జన్మించారు మాత అమృతానందమయి.
          చిన్నప్పటినుంచి పేదరికంలో ఉన్న ప్రజల పట్ల జాలి దయా ప్రేమను కలిగి ఉండేది ఇబ్బందుల్లో ఉండే వారి కోసం తన ఇంట్లో నుండి బట్టలు ఆహారం తెచ్చి పంచుతూ ఉండేది కానీ ఆమె కుటుంబం కూడా పేదవారు కావడం వల్ల ఇంట్లో వారందరూ ఆమెను తిట్టేవారు కానీ ఆమె తన సేవను ఆపలేదు తన లోపలి నుండి అందరి పట్ల ఉప్పొంగే ప్రేమను అందరికీ పంచాలని భావనతో దుఃఖంలో ఉండే వారిని ఓదార్చడానికి ఆకస్మికంగా కౌగిలించుకోవడం ప్రారంభించింది.
        ఆవిడ కౌగిలించుకోవడం వల్ల వెంటనే వాళ్ళ సమస్యలు తీరిపోతూ ఉండేవి ఇతరులను ఆలింగణం చేసుకోవాలనే తన కోరికను గురించి అమృతానందమయి అమ్మగారు ఇలా వ్యాఖ్యానించారు" నేను కౌగిలించుకునేటప్పుడు అది పురుషుడా స్త్రీ అని నేను చూడను నా స్వభావానికి భిన్నంగా నేను ఎవరిని చూడను" నా నుండి నిరంతరం ప్రేమ ప్రవాహం అందరికీ ప్రవహిస్తుంది. అందరూ నా బిడ్డలే ఇది నా సహజ స్వభావం రోగులకు చికిత్స చేయడమే వైద్యుని యొక్క కర్తవ్యం "నేను మీ అందరి యొక్క వైద్యురాలిని" అని అమృతానందమయం అమ్మవారు చెప్పేవారు అమృతానందమయి గారు తన పెళ్లికి ఏర్పాట్లు చేసిన ఆమె తిరస్కరించింది .
          1981లో మాత అమృతానందమయి మఠం స్థాపించబడింది అమ్మ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు నేను ఈ మఠం అనే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంది 1987లో భక్తుల కోరిక మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది శ్రీ అమృతానందమయి 30 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను ఆలింగణం చేసుకొని తన ప్రేమకు హద్దులు లేవని చాటుకున్నారు ఆమెను చూడటానికి వచ్చే ప్రజల కోసం ఒక్కొక్క రోజు 20 గంటలకు పైగా దర్శనమిచ్చిన సందర్భాలు ఉన్నాయి.
    ధ్యానం కర్మయోగం నిస్వార్థ సేవ, కరుణ ,ఓర్పు క్షమాగుణం ,స్వీయ నియంత్రణ వంటి ఎన్నో దైవిక లక్షణాలను గురించి అమ్మ బోధిస్తూ ఉండేది.
       ఆమె ఐక్యరాజ్యసమితిలో అనేకసార్లు ప్రసంగించారు మరియు ప్రపంచ మతాల పార్లమెంటులో రెండుసార్లు ప్రసంగించారు శ్రీ అమృతానందమయి అమ్మ 35 భాషల్లో 1000 కంటే ఎక్కువ భజనలను భక్తి గీతాలను పాడారు అమ్మ స్థాపించిన ఎంబ్రాసింగ్ ది వరల్డ్ సంస్థ పేదలకు ఆహారం నివాసం ఆరోగ్య సంరక్షణ విద్య మరియు జీవనోపాధి వంటి ఐదు ప్రాథమిక అవసరాలను అందించాలని లక్ష్యంతో పని చేస్తూ ఉంది అమ్మ మఠం.
        వివిధ కేంద్రాల ద్వారా సంవత్సరానికి 10 మిలియన్ల మందికి ఉచిత భోజనాన్ని అందిస్తోంది 5000 గ్రామ కేంద్రాలలో స్వచ్ఛమైన తాగు నీటిని అందించటంతో తోడ్పడునందిస్తోంది ఇది 10 మిలియన్ల గ్రామస్తులకు నీటి శుద్ధికరణను అందిస్తోంది నిరాశ్రయుల కోసం 47 వేల గృహాలను నిర్మించింది నాలుగు మిలియన్ల మందికిపైగా ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించింది కొచ్చిలో 11 పడకల ఆసుపత్రి, హర్యానాలో 2600 పడకల ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యాన్ని అందిస్తోంది అమ్మ లక్షల మందికి జీవితకాల పెన్షన్లను అందిస్తోంది 2 లక్షల మందికి స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది అమ్మ. 50 వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్లను కూడా నిర్వహిస్తోంది .
    అమ్మ 2001 గుజరాత్ భూకంప సమయంలో 2004లో సునామీ వచ్చినప్పుడు బీహార్ లో మహారాష్ట్రలో వరదలు వచ్చినప్పుడు ఎన్నో భూకంపాలు వచ్చినప్పుడు అమ్మ మఠం లక్షలాది మందిని ఆదుకుంది పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సహాయం చేసింది అమ్మ మఠం 2012లో ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావంతమైన వ్యక్తుల్లో 100 మంది వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు.
  లక్షల మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్న అమ్మ దర్శనం కోసం వెళ్లేవారు నిజంగా అదృష్టవంతులే అటువంటి గొప్ప కార్యాలను నిర్వహించిన మాత అమృతానందమయి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ......సర్వేజనా సుఖినోభవంతు....... ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీరామ విశ్వంభర దాస్ జటల సాధువు చరిత్ర

       440 సంవత్సరాలు జీవించిన ఒక మహాయోగి గురించి తెలుసుకుందాం రండి....( birth1550- death1993 June 5)
     శ్రీశ్రీ శ్రీ రామ విశ్వంభర దాస్ గారు హిమాలయాలనుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించిన ఒక గొప్ప సాధువు ఆయన మొదట్లో నగ్నంగా సంచరించేవారు ఆయనను అందరూ కూడా జటల సాధువుగా పిలుస్తూ ఉండేవారు శ్రీ స్వామివారికి న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వారు ఒక వైద్య పరీక్షను నిర్వహించారు ఆ పరీక్షలో 400 సంవత్సరాలు పైగా ఆయన జీవించారని నిర్ధారించబడింది. 
      ఆయన తల్లిదండ్రులకు ఎనిమిదవ సంతానంగా రోహిణి నక్షత్రంలో జన్మించాడు పుట్టినప్పుడు ఆయన నిర్జీవంగా జన్మించి మరణంతో చిన్నప్పటినుంచి ఆడుకోవడం మొదలుపెట్టాడు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరణం వస్తుందని ఆయనకు ముందే తెలుసు కాబోలు.
           ఆ తర్వాత కొంతసేపటికి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు ఆ బాలుడు ముఖంలో ఏదో తెలియని తేజస్సును తల్లిదండ్రులు గమనించారు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో గురుసేవ కోసం మరియు తపస్సు చేయడం కోసం ఇంటిని విడిచి పెట్టాడు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ తపస్సు చేస్తూ ఎంతో మంది మహాత్ములను సేవించి 1850లో సింహాచలానికి వచ్చి స్థిరపడ్డారు .
       ఆయన ఆ సమయంలో నగ్నంగానే సంచరించేవారు తర్వాత భక్తుల కోరిక మేరకు కుంకుమ రంగు దోతిని ధరించడం ప్రారంభించారు ఝాన్సీ లక్ష్మీబాయి ఒకసారి ఆయన ఆశీర్వాదం పొందింది అని ఆయనే స్వయంగా భక్తులకు చెప్పారు శ్రీ స్వామి వారు రోజు గాయత్రీ మాతను పూజించి నవగ్రహ హోమం చేసేవారు అందులో నుండి వచ్చిన హోమ భస్మం భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు అంతేకాకుండా సమస్యల్లో ఉన్న వ్యక్తులకు తన నమ్మిన వ్యక్తులకు కష్టాల్లో ఉన్న వ్యక్తులకు రోగంతో బాధపడే వ్యక్తులకు కాగితపు ముక్కలను చంపి రక్షగా భక్తులకు ఇచ్చేవారు .
      ప్రస్తుతం ఆయన సమాధి ఆంధ్రాలోని విశాఖ జిల్లా సింహాచలంలోని పర్వతాలలో ఉంది.
       తాను శిరిడి సాయిబాబా గారితో కలిసినప్పుడు హుక్కా సేవించినట్లు స్వయంగా ఆయనే తన భక్తులకు తెలియజేశారు బొబ్బిలి యుద్ధం కాలంనాటి సన్నివేశాలను ఆయన స్వయంగా చూశారని భక్తులతో చెప్పారు మాజీ ప్రధానమంత్రి మాజీ రాష్ట్రపతులు అంతేకాకుండా జ్ఞానీ జైల్ సింగ్ మరియు వివి గిరి ఆనాటి ముఖ్యమంత్రిలు మర్రి చెన్నారెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖులు ఆయన యొక్క ఆశీర్వాదం పొందడం కోసం వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు .
        ఈ మధ్యనే హైదరాబాద్లో ఈ మధ్యనే హైదరాబాదులో మియాపూర్ లో కూడా స్వామివారికి సంబంధించిన ఒక ప్రతిమతో ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులు శ్రీ రామ విశ్వంభరదాసు జటల సాధువు గారు 440 సంవత్సరాలు పైగా జీవించి ఎంతోమందిని తన యొక్క యోగశక్తితో ఆధ్యాత్మిక శక్తితో తన వైపు ఆకర్షించుకొని ఆధ్యాత్మిక విలువలని యోగ విలువల్ని సమాజానికి తెలిసేలా చేశారు....
సర్వేజనా సుఖినోభవంతు..... ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ ఆండాలు గోదాదేవి చరిత్ర

          ఏడవ శతాబ్దానికి చెందిన మహాత్మారాలు శ్రీ ఆండాలు గారు ఈమెను గోదాదేవి ,కోటై ,నాచియార్ అని కూడా పిలుస్తారు ఈవిడ గొప్ప కవి మరియు సన్యాసిని తమిళనాడు రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు శ్రీ గోదాదేవి గారికి ఉన్నాయి.
        శ్రీ గోదాదేవి గారు రెండు గొప్ప తమిళ రచనలు చేశారు అందులో ఒకటి తిరుప్పావై మరొక నాచియార్ తిరుమొడి.
       తమిళనాడులోని శ్రీ విళ్లి పుత్తూరులో ఆమె జన్మించారు ఈవిడను భూదేవి అంశగా భక్తులు భావిస్తారు పెరియాళ్వారనే విష్ణు భక్తుడు సంతానం కోసం భగవంతుని ప్రార్థించగా ఒకరోజు గుడి లోపల తోటలో తులసి మొక్క కింద ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయికి కోటై అని పేరు పెట్టి పెంచుకున్నాడు అయితే ఒకసారి ఆలయంలో ప్రధాన దేవత విగ్రహానికి మాల వేయకముందే ఆ మాలను ఆ అమ్మాయి ధరించగా పెరియాల్వార్ వారు చాలా బాధపడి కూతుర్ని తిట్టాడు.
    అయితే పెరియాల్వరుకు రాత్రి కలలో శ్రీ మహావిష్ణువు కనబడి తనకు కోటై ధరించిన మాలను మాత్రమే అంకితం చేయమని కోరాడు అయితే ఆ మాలను విగ్రహానికి వేయగా విష్ణువు బంగారంగా మారిపోయాడు అప్పుడు కోటై అనే ఆ అమ్మాయికి ఆండాలని పేరు మార్చారు.
         శ్రీ ఆండాళ్ భక్తి పూర్వక వాతావరణం లో పెరగటం వల్ల దేవున్ని మాత్రమే వివాహం చేసుకోవాలని ఉచ్చుకత పెరిగింది తిరువరంలోని రంగనాథర్ ని వివాహం చేసుకోవడం గురించి ఆమె నిరంతరం ఆలోచించేది రంగనాథర్ గారు అంటే విష్ణు యొక్క నిద్రించే రూపం ఆమె తన రచనల ద్వారా ఎంతో మందిలో భక్తి జ్ఞానాన్ని ప్రేరేపించింది.
       భగవంతుని పాదాల వద్ద శరణాగతి పొందడమే జీవిత పరమావధి అని నొక్కి చెబుతూ ఉండేది తమిళల ప్రసిద్ధ కవి సన్యాసులలో ఆండాలు ఒకరు.
      తమిళనాడులో ఆండాళ్ ఒక సాధువు కంటే ఎక్కువగా కొలవబడుతుంది అనేక విష్ణు ఆలయాలలో శ్రీ ఆండాలు గారి కోసం ఒక మందిరం అంకితం చేయబడింది శ్రీ వెళ్లి పుత్తూరు ఆలయంలోని ఆండాలకు ధరించిన దండలు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలోని వెంకటేశ్వర ఆలయానికి పంపబడతాయ శ్రీ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోని రంగనాథుడు ఆండాలను వివాహం చేసుకున్నాడని ఆ తర్వాత ఆమె ఆ విగ్రహం లోనే కలిసిపోయిందని భక్తులు నమ్ముతారు.
        శ్రీ ఆండాళ్ రంగనాథుడిని వివాహం చేసుకున్నందుకు ఆ అధిష్టాన దేవతను రంగమన్నారు అని పిలుస్తారు.
       శ్రీ ఆండాలు గారు రచించిన తిరుప్పావై వేదాల మకరందమని తాత్విక విలువలు నైతిక విలువలు స్వచ్ఛమైన భక్తి ప్రేమ అంకితభావం ధర్మాలు, లక్ష్యాలు మరియు జీవిత పరమార్ధాన్ని బోధించేదని చెబుతారు శ్రీ ఆండాల్ గారి విగ్రహ కేశాలంకరణ మరియు అలంకారాలు ప్రాచీన తమిళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటాయి వెంట్రుకలు కుచ్చును పక్కకు కట్టి మల్లెపూలు మరియు విస్తారమైన ఆభరణాలతో అలంకరిస్తారు అమ్మవారి విగ్రహాన్ని శ్రీ వెళ్లి పుత్తూరు ఆండాలు చేతిలో రూపొందించిన చిలుకను ప్రతిరోజు ఎంతో కష్టంతో తయారుచేస్తారు ప్రతిరోజు కూడా తాజాపచ్చి ఆకులతో తయారుచేస్తారు ఈ చిలుక ఆండాల్ గారి యొక్క ఎడమ చేతిలో ఉంచబడుతుంది ఈ చిలుకను తయారు చేయడానికి దాదాపు నాలుగున్నర గంటలకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ చిలుకను తయారు చేయటానికి ముక్కు మరియు నూటికి దానిమ్మ పువ్వు కాళ్లకు వెదురు కర్రలు, అరటి మొక్క, నందివర్ధనాలు ,గులాబీలను ఇతర పుష్పాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
        శ్రీ అండాల్ గారు తన రచనల్లో తిరుప్పావై ఎక్కువ ప్రచారంలో ఉండేట్టుగా ఆవిడ రచించారు ఇది 30 శ్లోకాలతో కూడి ఉంటుంది భక్తి మార్గంలో జన్మ ధన్యం గావించుకున్న మహాత్మురాలు శ్రీ గోదా దేవి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ....
సర్వేజనా సుఖినోభవంతు జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శ్రీ భక్తి హృదయ భాను చరిత్ర

      గౌడీయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో వేద పండితులైన బ్రహ్మ ఋషి రజినీకాంత పుణ్య దంపతులకు 1901 వ సంవత్సరంలో బెంగాల్లో నరేంద్రనాథ్ ముఖర్జీ జన్మించారు.
        ఆయన వయసు పెరిగే కొద్దీ భక్తి సిద్ధాంతం వైపు ఆకర్షించబడ్డారు బ్రహ్మచారిగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వద్దకు చేరుకొని భక్తి సిద్ధాంతాన్ని పాటిస్తూ దీక్ష తీసుకున్నారు ఆ క్షణం నుండి ఆయన పేరు భక్తి హృదయ భానుగా మారిపోయింది.
       భక్తి మార్గంలో తన జీవితాన్ని ఆయన మహాత్ముడిగా మలుచుకునేందుకు భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు భగవాన్ నామాన్ని నిరంతరం పటిస్తూ ఉండేవాడు 1924వ సంవత్సరంలో 23 ఏళ్ల వయసున్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ప్రభుపాదుల వారి నుంచి జీవితకాల త్రిదండ సన్యాసాన్ని ఆయన స్వీకరించారు.
      ఆయన భారతదేశం అంతట అనేక ఉపన్యాసాలు ఇస్తూ చైతన్య మహాప్రభు సందేశాన్ని బోధించాడు అత్యంత వేగంగా ఆయన ఉపన్యాసాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు అతను మద్రాసులో గౌడీయ మఠాన్ని స్థాపించాడు బోధకుడిగా ఎంతో విజయవంతమై ఆ కాలంలో భారతదేశమంతటా ప్రసిద్ధి చెందాడు.
        అతని కులం మరియు ఉన్నత విద్యాభ్యాసం కారణంగా భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారు భక్తి హృదయ భాను గారిని జర్మనీకి పంపించారు అక్కడ ఆయన తన సందేశాలను వినిపించారు 1942లో గురువుగారు మరణించిన తర్వాత మఠానికి తదుపరి ఆచార్యుడిగా భక్తి విలాస్ తీర్థ గారిని అంగీకరించాడు.
        శ్రీ భక్తి హృదయ భాను గారు తీవ్రమైన తపస్సు చేయడం కోసం ఏకాంతంగా కాలినడకన హిమాలయాలకు వెళ్ళాడు అయితే ఈ దీక్ష కాలంలో ఆయన కొన్ని ప్రమాణాలు చేసుకున్నారు.
 అందులో మొదటిది ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, రెండవది చెట్లనుండి పండ్లు మరియు కాయలను మాత్రమే తినాలి, మూడవది నేలపై ఒట్టి శరీరంతో నిద్రించాలి, నాలుగవది మహా మంత్రాన్ని జపించకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు ఇలా నాలుగు ప్రమాణాలు చేసుకున్నారు.
         ఆ తర్వాత 650 మైళ్ళు కాలినడకన నడిచి ఎన్నో రోజులపాటు ఆయన తపస్సు చేస్తూ ఎన్నో సంవత్సరాల పాటు భగవద్ ధ్యానంలో గడిపి భజన చేస్తూ గడుపుతూ ఉండేవాడు తర్వాత బృందావన్ కి తిరిగి వచ్చి పదవి విరమణ చేసి అక్కడ ఒక చిన్న భజన కుటీర్ని నిర్మించాడు ఆయన బోధనల వల్ల బెంగాల్లో వేల మంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు.
         భక్తి హృదయ భాను గారు పాఠశాలలను విద్యాలయాలను మరియు కొన్ని  ఆశ్రమాలను స్థాపించారు ఎన్నో రచనలు చేశారు ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ లోని తన భజన కుటీర్లో జూలై ఏడవ తేదీ 1982న రాత్రి 9 గంటల నాలుగు నిమిషాలకు తన శిష్యుల సహవాసంలో మరణించారు భక్తి సిద్ధాంతాన్ని పాటిస్తూ భక్తి శక్తితో ముక్తి పొందిన మహా వ్యక్తి శ్రీ భక్తి హృదయ భాను గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ......సర్వేజనా సుఖినోభవంతు ....
జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః

యోగిలా మారిన డాక్టర్ అనుకూల చంద్ర చక్రవర్తి

     ఒకప్పటి బ్రిటిష్ ఇండియాలోని పబ్నా జిల్లాలోని హిమాయత్ పూర్ అనే గ్రామంలో బ్రాహ్మణ దంపతులైన శివచంద్ర చక్రవర్తి మరియు మోహిని దేవి అనే పుణ్య దంపతులకు సెప్టెంబర్ 14న 1888 వ సంవత్సరంలో జన్మించాడు అనుకూల చంద్ర చక్రవర్తి గారు ఆయన 1911లో కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తూనే చుట్టుపక్కల మురికివాడల్లో నివసించే వారికి చికిత్స చేయడం ప్రారంభించాడు.
      ఆరు సంవత్సరాల వైద్య విద్య పూర్తయిన తర్వాత హిమాయత్పూర్ కి తిరిగి వచ్చి వైద్యం చేయటం ప్రారంభించాడు 1913 వ సంవత్సరంలో తల్లి ద్వారా ఆధ్యాత్మిక దీక్షను పొందాడు ఆ తర్వాత ఆ దీక్షను సాధన చేస్తూ గడిపాడు .
      అలా సాధన చేసే సమయంలో సమాధి స్థితికి చేరుకొని ఆ స్థితిలో నుండి పవిత్రమైన సందేశాలను అందించేవాడు అది ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది ఎంతోమంది ఆయనను చూడటానికి వచ్చి అతని దగ్గరే శాశ్వతంగా స్థిరపడటం ప్రారంభించారు క్రమంగా అతని గ్రామం ఆశ్రమంగా మార్చబడింది .
       ఆయన ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు ఎంతగా అంటే ఆయన భక్తులు ఆయనను ఒక యుగ పురుషోత్తముడిగా తలిచేవారు ఆయన జనవరి 27 1969 వ సంవత్సరంలో మరణించారు.
       ఆయన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం 1987లో స్మారక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది అనుకూల చంద్ర ఠాకూర్ గారు సత్సంగ్ అనే ఆశ్రమాన్ని డియోగర్లో ఏర్పాటు చేశారు ఈ ఆశ్రమం ద్వారా సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటికీ జరుగుతూ ఉన్నాయి.
         ఉచిత ఆసుపత్రి ఉచిత బహుజన సౌకర్యం ఉచిత పాఠశాలలను ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది అంతేకాకుండా సత్సంగ్ ఆశ్రమంలో వేద అధ్యయనాలు జరుగుతాయి గోశాలను కూడా నిర్వహిస్తున్నారు.
         ఈ ఆశ్రమానికి ప్రతినిత్యము వేల సంఖ్యలో జనులు హాజరవుతారు ఎంతగా అంటే 2012 సెప్టెంబరు లో శ్రీ అనుకూల చంద్ర ఠాకూర్ గారి 125 వ జయంతి రోజున దాదాపు రెండు లక్షల మందికి పైగా హాజరైనప్పుడు తొక్కిసలాట జరిగి సత్సంగ ఆశ్రమంలో 12 మంది మరణించారు 30 మంది వ్యక్తులు గాయపడ్డారు.
           శ్రీ ఠాకూర్ గారు స్థాపించిన సత్సంగ్ ఆశ్రమానికి బంగ్లాదేశ్ ,బర్మ, యూరప్, మిడిల్ ఈస్ట్ ,ఆఫ్రికా మరియు అమెరికాలో రెండు వేలకు పైగా శాఖలు ఉన్నాయి అంతేకాదు దాదాపుగా 80 మిలియన్ల మంది సభ్యులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతోంది.
      ఈ సత్సంగ్లో ఉండే సభ్యులందరినీ సత్సంగులు అంటారు ఈ సత్సంగ్ సభ్యులతో అన్ని మతాల కు చెందిన వ్యక్తులు ఉన్నారు శ్రీ ఠాకూర్ గారు ఏ మతాన్ని తిరస్కరించలేదు మతాలన్నీ ధర్మాలు అని బోధించడం వల్ల హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇతర ఇతర మతాలవారు వేగంగా సత్సంగ్ పట్ల ఆకర్షితులయ్యా.
           రు ఈ ఆశ్రమంలో శ్రీ అనుకూల చంద్ర ఠాకూర్ జయంతి ఆయన భార్య శ్రీ బోరోమా జయంతి ఆయన పెద్ద కుమారుడు శ్రీ బోర్డ జయంతి ప్రస్తుత ఆచార్యదేవ్ అశోకే చక్రవర్తి జన్మదినోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు.......
    ఒక డాక్టర్ యోగిలా మారితే శ్రీ అనుకూల చంద్ర చక్రవర్తిల మారగలడు అని నిరూపించిన మహాత్ముడైన శ్రీ అనుకూల చంద్ర గారి పాదపద్మములకు నమస్కరిస్తూ...... సర్వేజనా సుఖినోభవంతు
 జై గురుదేవ్....‌‌
 ఓం శ్రీ గురుభ్యోనమః.......

మహా శ్రీ అరుణ గిరి నాదర్ చరిత్ర

       శ్రీ అరుణగిరి నాధర్ గారు 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని తిరువన్నామలైలో సెంగుంత కైకోలార్ కుటుంబంలో జన్మించాడు అతను పుట్టిన వెంటనే ఆయన తండ్రి మరణించాడు కరుణగిరి తల్లి మరియు సోదరి గార్లు అరుణగిరి గారికి సంస్కృతి సాంప్రదాయాలను గురించి బోధించేవారు కానీ ఆయన వాటిని గురించి పట్టించుకోకుండా తన యొక్క యుక్త వయసు భోగాలకు ఆకర్షితుడయ్యాడు.
           అతని సోదరి సోదరిడి సంతోషం కోసం తన సంపాదనంతా కూడా ఖర్చు చేస్తూ ఉండేది తన తమ్ముడు బాగు కోసం ఆవిడ నిరంతరం తపిస్తూ ఉండేది అతడు ఏది అడిగితే అది ఇస్తూ ఉండేది అయితే అరుణగిరి మాత్రం దేవదాసీలను సందర్శించేవాడు విచ్చలవిడిగా తన జీవితాన్ని అనుభవించడం వల్ల ఒకానొక దశలో ఆయనకు కుష్టువ్యాధి సోకి నరక వేదనను ఆయన అనుభవించేవాడు.
        ఒకసారి తన సొంత సోదరి దగ్గరకు వెళ్లి డబ్బు కావాలి అని అడిగాడు ఆ సమయంలో ఆమె దగ్గర డబ్బు లేదు అప్పుడు తన దగ్గర ఉన్నదంతా అయిపోయిందని చెప్పింది ఒకవేళ నీకు ఇంకా డబ్బు కావాలంటే తనను అమ్మితే డబ్బు వస్తుందని కూడా ఆమె చెప్పింది ఆ క్షణంలో తాను ఎంత స్వార్ధపరుడో తనకు అర్థమయింది అరుణగిరి గారు తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు.
          ఆలయానికి వెళ్లి స్తంభాలకు మెట్లకు తలను బాదుకున్నాడు క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు ఆలయ గోపురం పైకి ఎక్కి చనిపోవాలని పైనుంచి దూకాడు కానీ ఆ సమయంలో భగవంతుడే ఆయన దగ్గరికి వచ్చి అతని కాపాడాడు అతనికి కుష్టు వ్యాధి కూడా ఆ క్షణంలోనే నయమైపోయింది.
       ఆ తర్వాత తన జీవితాన్ని భక్తి మార్గం వైపు మళ్లించి మొదటి భక్తి గీతాన్ని భగవంతుని చూసిన క్షణంలోనే ఆశువుగా ఆలపించాడు ఆయన (మురుగన్) సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుడు ఆయన గీతాలు ఆలపిస్తూ ఉంటే ప్రజలందరూ ఆకర్షితులయ్యేవారు అతని కీర్తి ఆ రాజ్యపు ముఖ్యమంత్రి లో అసూయను రగిలించగా రాజు వేలాది మందితో బహిరంగ సభను ఏర్పాటు చేసి మురుగన్ ఉనికిని ఇతరులకు నిరూపించమని అరుణగిరిని ఆదేశించాడు అరుణగిరి గారు మురుగన్ కోసం భక్తి గీతాలను ఆలపించగా బాలమురుగన్ ప్రత్యక్షమయ్యాడు అరుణ గిరిని మరొకసారి ఆ బాలుడి రూపంలో వచ్చి కాపాడాడు .
        అరుణగిరి గారు దక్షిణ భారతదేశంలోని ఎన్నో దేవాలయాలను సందర్శించి 16 వేల పాటలను రచించాడు అంతేకాకుండా ఎన్నో ఇతర రచనలను కూడా చేశాడు.
      అరుణగిరి నాధర్ గారు సంగీతం మరియు తాళాలపై లోతైన జ్ఞానం కలిగి ఉండేవాడు ఆయన పద్యాలలో కీర్తనల్లో సాహిత్యపు విలువలతో పాటు భక్తి రసాన్ని కూడా ఆస్వాదించవచ్చు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా వారిపైన భగవంతుడి కృప జాలు వారితే శ్రీ అరుణగిరి నాదర్ లాగా ఒక మహాత్ముడిలా జీవితాన్ని సమర్థవంతంగా సార్ధకం చేసుకోగలుగుతాం కాబట్టి భగవంతుడి కృప కోసం నిరంతరం తపిద్దాం భగవాన్ నామ స్మరణ చేద్దాం శ్రీ అరుణగిరి నాదర్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ.... 
సర్వేజనా సుఖినోభవంతు...
 జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః

పురోహితుడు కూతురు కుపరాబాయి జీవిత చరిత్ర

           భారతదేశంలో ఎంతోమంది సనాతన ధర్మంలో అత్యంత కీలకమైన భక్తి యోగంతో ముక్తిని పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు భగవంతుని నిరంతరం స్మరిస్తూ ప్రతి అణువణువులో భగవంతుని దర్శించిన మహాత్ములైన భరతమాత ముద్దు బిడ్డలు ఎంతో మందికి ఆదర్శం. భక్తి యోగం ద్వారా మహాత్ములైన వారిలో ఒక మహాత్మురాలి గురించి మనం తెలుసుకుందాం.
        పురోహిత పుణ్య దంపతులైన వారి ఇంటిలో సంతానం కోసం ఎన్నో రోజుల నుంచి తపన మొదలైంది పురోహిత దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేదు వారు సంతానం కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు పూజలు వ్రతాలు దీక్షలు ఇలా ఎన్నెన్నో చేశారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు ఆఖరకు ఒకానొక రోజున చుట్టుపక్కల వారి సమాచారంతో ద్వారకా నగరానికి వెళితే కృష్ణ సేవ చేస్తే మంచి జరుగుతుంది అని తెలుసుకొని ద్వారకా నగరానికి పయనమై వెళ్ళిపోయారు అక్కడే ఉంటూ శ్రీకృష్ణ సేవ చేసుకుంటూ తమ యొక్క సంతానానికి అడ్డుపడే కర్మలను కరిగించుకున్నారు భగవంతుడి దయవలన ఆ కృష్ణుడి యొక్క కృపతో ఒక అందమైన చక్కటి అమ్మాయి జన్మించింది ఆమెకు కుపరాబాయి అని పేరు పెట్టారు.
         అయితే ఆ అమ్మాయి జన్మించేటప్పుడు సాయంగా మంత్రసాని రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి సాయం చేసి వెళ్లిపోయాడు తర్వాత అక్కడే ద్వారక నగరంలోనే కుపరాబాయి చిన్నతనం అంతా గడిచింది .చిన్నతనం నుంచే కృష్ణ భక్తిని అలవాటు చేసుకుని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ భక్తిని కొనసాగిస్తూ నిరంతరం శ్రీకృష్ణుడి మంత్రాన్ని పటిస్తూ ఉండేది ఆ తర్వాత వాళ్లు తమ సొంతూరికి వెళ్లిపోయారు.
        కానీ కుపరాబాయి మాత్రం నిరంతరము భగవత్ ధ్యానంలో మునిగి ఉండేది శ్రీకృష్ణుడి మంత్రాన్ని నిరంతరము ఆపకుండా జపిస్తూ ఉండేది ఒకానొక దశలో తల్లిదండ్రులు ఆమెకు యుక్తవయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు ఆ తర్వాత ఆమె భర్తను విడిచిపెట్టి తీర్థయాత్రలు చేసి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ చివరకు ద్వారక చేరుకుంది తండ్రి ఆమెను వెతుకుతూ వెళ్లి ద్వారకా నగరంలో ఉన్న తన కూతుర్ని చూసి ఆనందపడి తన ఇంట ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు ప్రతినిత్యము భగవత్ ధ్యానంలో లీనం అయిపోయి ఉండేది అలా నిరంతరము ఆమె భగవత్ ధ్యానంలో ఉండటం వలన ఆమెకు వాక్సుద్ధి భవిష్యత్తు భవిష్యత్తు జ్ఞానము కలిగాయి  అయితే తన దగ్గరికి వచ్చిన వారి వ్యక్తుల యొక్క సమస్యలను అత్యంత సులువుగా పరిష్కరించేది.
         ఆమె యొక్క ప్రజ్ఞ విశేషంగా వ్యాపించి ఆమె చుట్టూ ప్రజలు వచ్చి చేరేవారు ఆమె ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేవారు తన భక్తుల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆమె భగవంతుని ధ్యానిస్తూ ఉండేది ఒకానొక రోజున తను వచ్చిన కార్యం పూర్తి అయింది అని భావించి ఆమె శ్రీకృష్ణుడిలో ఐక్యం చెందింది.... భక్తి యోగం యొక్క విశిష్టత ఏమిటో కుపరాబాయి జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి మహాత్మురాలి పాదపద్మములకు నమస్కరిస్తూ..
 సర్వేజనా సుఖినోభవంతు  ....
జై గురుదేవ్....
 ఓం శ్రీ గురుభ్యోనమః

Demo class 7 days yoga class registration

Loading… ఫారం సబ్మిట్ చేసిన తర్వాత WhatsApp లో మమ్మల్ని సంప్రదించండి 🙏 📲 Contact on WhatsApp Your free book View ...